హైదరాబాద్ : సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ శుక్రవారం ఉదయం ఎర్రగడ్డ చెక్పోస్టును తనిఖీ చేశారు. లాక్డౌన్ ఆంక్షలు, పరిస్థితులను పర్యవేక్షించారు. రోడ్లపై వచ్చిన వాహనదారులను ఆపి.. అనవసరంగా రోడ్లపై తిరిగే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపైకి ఎవరూ రావొద్దని, లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కరోనా కట్టడికి అందరూ సహకరించాలని ప్రజలకు సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని పోలీసులను ఆదేశించారు.