పుకార్లపై సైబర్ నిఘా..!

- సోషల్మీడియాలో నకిలీ వార్తల ప్రచారం
- అలర్ట్ అయిన పోలీసులు
- ఎన్నికలకు మూడు కమిషనరెట్ల పరిధిలో పటిష్ట బందోబస్తు
- సీసీ కెమెరాలతో అడుగడుగునా నిఘా..
- సీసీసీ నుంచి పర్యవేక్షణ..
- ఓటర్లను భయపెట్టినా, ప్రలోభపెట్టినా డయల్ 100..
- డబ్బులు పంచినా, అల్లర్లు సృష్టించినా చర్యలు ..
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నకిలీ వార్తలతో పుకార్లు సృష్టించడం.. ఒకరిపై మరొకరు లేనిపోని అబద్దాలతో వీడియోలు, ఫొటోలతో సోషల్మీడియా ద్వారా ప్రచారం చేసి ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకు అవకాశముండటంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు అలర్ట్ అయ్యారు. సోషల్ మీడియాపై నిరంతరం నిఘా ఉంటుందని.. ఎవరైనా రెచ్చగొట్టే పోస్టింగ్లు పె ట్టినా, ఆడియోలు, వీడియోలను షేర్చేసినా కఠిన చర్య లు తప్పవని మూడు కమిషనరేట్ల సీపీలు హెచ్చరించారు. ఇటీవల జరిగిన దుబ్బాక ఎన్నికల రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు టీవీ9 పేరుతో నకిలీ బ్రేకింగ్ను సృష్టించి.. దానిని సోషల్మీడియాలో ప్రచారం చేసి, ఓటర్లను అయోమయానికి గురిచేశారు. దీనిపై సీసీఎస్ సైబర్క్రైం పోలీసులకు టీవీ9 ప్రతినిధులు ఫిర్యాదు కూడా చేశారు. తాజాగా.. మంగళవారం జరుగుతున్న బల్దియా ఎన్నికల్లో కూడా కొన్ని జాతీయ పార్టీలు ఈ కుట్రలకు పాల్పడే అవకాశాలున్నాయి.
ఆయా డివిజన్లలోని తమ ప్రత్యర్థులపై సోషల్ మీడియా ద్వారా బీజేపీ బురద జల్లెందుకు కుతంత్రాలు మొదలు పెట్టినట్లు ఆరోపణలున్నాయి. ఏకంగా సీఎం ఫొటోనే మార్ఫింగ్ చేసి.. సోషల్మీడియాలో అబద్దపు ప్రచారం చేస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాను తమ స్వార్థానికి ఉపయోగించుకుంటూ ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టువు ఆయిన ఓటును తప్పుదారి పట్టించేందుకు కుట్ర పన్నుతున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు సైబర్క్రైం పోలీసులు అంతటా నిఘా పెట్టారు. ఉదయం 6 గంటల నుంచే సైబర్క్రైమ్ పోలీసులు అందుబాటులో ఉండనున్నారు. ఎవరైనా నకిలీ వార్తను ప్రచారం చేసి, పుకార్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తే.. అది నకిలీదని అనుమానం రాగానే వెంటనే సైబర్క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలి... బాధ్యత గల పౌరులుగా వాటిని ఇతరులకు పంపించకుండా.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సైబర్క్రైమ్స్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ సూచించారు. అలాంటి పుకార్లను నమ్మొద్దని, ఏమైనా ఉంటే వెంటనే డయల్ 100కు గానీ, నేరుగా ఫోన్: 9490616152 కు గానీ సమాచారం ఇవ్వాలని ఏసీపీ సూచించారు.
ఎన్నికలకు పటిష్ట బందోబస్తు.. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో...
రాచకొండ పరిధిలో..
సైబరాబాద్ పరిధిలో...
తాజావార్తలు
- ‘రెడ్’ కలెక్షన్స్..రామ్ టార్గెట్ రీచ్ అయ్యాడా..?
- ప్రియుడు చేతిలో యువతి దారుణ హత్య
- ఉపయోగించని బ్యాంకు అకౌంట్లు మూసేయండిలా!
- తెలంగాణ సాగునీటి ముఖచిత్రాన్ని మార్చిన కాళేశ్వరం : సీఎం కేసీఆర్
- ఆస్ట్రేలియా మాజీలకు అదిరిపోయే పంచ్ ఇచ్చిన అశ్విన్
- మరో క్రేజీ ప్రాజెక్టులో పూజాహెగ్డే..?
- ట్రాక్టర్ల ర్యాలీపై వెనక్కి తగ్గం..
- అందరూ హీరోలే.. నమ్మశక్యం కాని విజయమిది
- నా సినిమా ఎవరైనా చూస్తారా అనుకున్నా : విజయ్ దేవరకొండ
- సీ ఓటర్ సర్వేలో ఆసక్తికర విషయాలు.. బెంగాల్లో మళ్లీ గెలిచేది మమతనే!