హైదరాబాద్: రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆర్జిత సేవలు మళ్లీ ప్రారంభంకానున్నాయి. గత నెల 25న యాదాద్రి దేవస్థానంలో పనిచేస్తున్న అర్చకులు, సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మార్చి 28న ఆర్జిత సేవలు నిలిపివేశారు. కాగా, ఆలయంలో కరోనా ప్రభావం తగ్గడంతో వారం రోజుల అనంతరం సేవలను మళ్లీ ప్రారంభించనున్నారు. ఆర్జిత సేవలు, అన్నప్రసాద వితరణను రేపటి నుంచి పునరుద్ధరిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఆలయంలో సుమారు 78 మంది ఉద్యోగులు కరోనా బారినపడ్డారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..