హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): దేశంలో ఐదో తరం (5జీ) టెలికం సేవలు ప్రారంభం కావడంతో ఇదు అదనుగా దానిని అడ్డం పెట్టుకొని సైబర్ కేటుగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపుతున్నారు. 5జీ టెక్నాలజీకి అప్గ్రేడ్ కావాలంటూ మొబైల్ ఫోన్ల వినియోగదారులకు సైబర్ నేరగాళ్లు వివిధ రకాల లింకులతో కూడిన ఎస్ఎంఎస్లు, ఈ-మెయిళ్లు పంపుతున్నారు. సైబర్ నేరగాళ్లు తాము పంపిన లింకులను క్లిక్ చేయాలని, ఆ తర్వాత వచ్చే ఓటీపీ వివరాలను తమకు చెప్తే సిమ్కార్డును అప్గ్రేడ్ చేస్తామని మొబైల్ వినియోగదారులతో నమ్మబలుకుతున్నారు. ఇదంతా నిజమేనని నమ్మితే దారుణంగా మోసపోవడం ఖాయమని, ఆ కేటుగాళ్లు చెప్పినట్టు చేస్తే మీ బ్యాంకు ఖాతాలు లూటీ అయ్యే ప్రమాదం ఉన్నదని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇలా చేస్తే మీరు సేఫ్
సైబర్ నేరగాళ్లపై సీబీఐ దాడులు
న్యూఢిల్లీ, అక్టోబర్ 4: దేశవ్యాప్తంగా సైబర్ నేరాలపై సీబీఐ ఉక్కుపాదం మోపింది. ఆపరేషన్ చక్రలో భాగంగా పలు రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 105చోట్ల మంగళవారం దాడులు నిర్వహించింది. స్థానిక పోలీసు బృందాల సహకారంతో నిర్వహించిన ఈ దాడుల్లో పలు డిజిటల్ ఆధారాలతోపాటు రూ. 1.5కోట్ల నగదు, 1.5 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నది. 87 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు, 18 ప్రాంతాల్లో ఆయా రాష్ర్టాల పోలీసులు సోదాలు నిర్వహించారు. 300 మంది అనుమానితులను విచారించారు. అమెరికన్ పౌరులను మోసం చేస్తున్న పుణె, అహ్మదాబాద్లోని రెండు కాల్సెంటర్లపై సీబీఐ దాడులు నిర్వహించింది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు తెలియజేసినట్టు సీబీఐ అధికారవర్గాలు తెలిపాయి. ఇంటర్పోల్, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ), రాయల్ కెనెడియన్ మౌంటెన్ పోలీస్, ఆస్ట్రేలియా పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించారు.