సిటీబ్యూరో, సెప్టెంబరు 16(నమస్తే తెలంగా ణ): “సీఎమ్ హెల్త్ రీఫండ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను. మీకు రూ.35 వేలు వచ్చా యి. మీకు రేషన్ కార్డును ఇప్పిస్తాను. మీ ఖాతాలో రూ.6,500 ఉన్నాయా?” అని అడిగి ఓ రైతును సైబర్ మాయగాడు బుట్టలో వేసుకున్నాడు. ఇలా బుట్టలో పడ్డ రైతు స్నేహితుల ఫోన్ నెంబర్లు ఇవ్వడంతో వారి ఖాతాల నుంచి 1.02 లక్షలు సైబర్ చీటర్ కొట్టేశాడు. ఈ ఘటన రాచకొండ సైబర్ క్రైం పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కాగా, వివరాలిలా ఉన్నాయి. రాచకొండ పోలీసు కమిషనరేట్, అడ్డ గూడురు గ్రామానికి చెందిన బీరప్పకు ఇటీవల ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ‘నేను సీఎం హెల్త్ రీఫండ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నా నీకు రూ.35 వేలు మంజూరయ్యాయి.
నీకు రేషన్ కార్డు కూడా ఇస్తారు’ అని చెప్పాడు. ఆ తర్వాత నీ బ్యాంక్ ఖాతాలో రూ.6,500 ఉన్నా యా?’ అని అడిగాడు. ‘లేవని చెప్పడంతో.. అయి తే, నీకు ఈ రూ.35 వేలు రావు’ అని చెప్పాడు. అతను ఓ సలహా ఇచ్చాడు. మీ దోస్తులకు ఎవరైనా ఫోన్ నెంబరు ఉండి, దాంట్లో ఓ ఫోన్ పే ఉంటే చెప్పు వారికి పంపిస్తానని నమ్మించాడు. అయితే, బీరప్ప ఇద్దరి ఫోన్ నెంబర్లను ఇచ్చాడు. బీరప్ప ఫోన్ను కట్ చేసిన వెంటనే అతని స్నేహితుడు సోమయ్యకు ఫోన్ చేసి ఖాతా వివరాలు తెల్సుకొని నుంచి రూ.18,999లను కొట్టేశాడు. ఆ తర్వాత స్వామికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకొని స్వామి ఖాతా నుంచి రూ.83,999లను కొట్టేశాడు. ఈ ఘటనతో ఆందోళనకు గురైన బాధితులు రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైం అధికారులు దర్యాప్తును ప్రారంభించారు.