సిటీబ్యూరో, జూన్ 23(నమస్తే తెలంగాణ): ఓ వృద్ధురాలి బ్యాంకు ఖాతా నుంచి గుర్తుతెలియని వ్యక్తులు ఆరు నెలలుగా రూ.4.03 లక్షలు కాజేశారు. సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసుల వివరాల ప్రకారం.. నల్లకుంటలో నివాసముండే ఓ వృద్ధురాలు(93) మంగళవారం.. డబ్బులు డ్రా చేసుకొని రమ్మంటూ కోడలికి ఏటీఎం కార్డు ఇచ్చింది. అయితే ఏటీఎంలో ఆ కార్డును స్వైప్ చేయగా.. అందులో డబ్బు లేదని తేలింది. వెంటనే బాధితురాలు బ్యాంకుకు వెళ్లి స్టేట్మెంట్ తీసుకోగా.. ఆరు నెలలుగా ఆ ఖాతాలో నుంచి మొత్తం రూ.4.03లక్షలు కాజేశారని తేలింది. దీంతో బాధితురాలు సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.. అయితే.. కొన్ని రోజుల కిందట తన సెల్ఫోన్ పోయిందని బాధితురాలు పేర్కొంది.