ఉద్యోగం కోసం యత్నించిన ఓ వైద్యుడు.. సైబర్నేరగాళ్లకు చిక్కి రూ.1.07లక్షలు పోగొట్టుకున్నాడు. సైబర్ క్రైమ్ పోలీసుల వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ ఈఎన్టీ సర్జన్… పేరున్న దవాఖానలో ఉద్యోగం కోసం నౌకరీ.కామ్లో తన రెజ్యూమ్ను అప్లోడ్ చేశాడు. ఇతడి వివరాలను సేకరించిన సైబర్నేరగాళ్లు… అతడికి ఫోన్చేసి, మీరు కోరుకున్న దవాఖానలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ నమ్మించారు.. అయితే ముందుగా రిజిస్ట్రేషన్, వివిధ రకాల ఫీజులు అంటూ అతడి నుంచి రూ. 1.07 లక్షలు కాజేశారు. ఇంకా డబ్బులు అడుగుతుండటంతో అదంతా మోసమని గుర్తించిన బాధితుడు శనివారం సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.