హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ ): ఉన్నత విద్యామండలి అఫిషియేటివ్ చైర్మన్గా నియమితులైన ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్కుమార్ను కలిశారు. అలాగే, తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ కె.భాస్కర్ రెడ్డి, ఎస్బీఐ సీజీఎం అమిత్ జిన్గ్రాన్, ఏఎస్ఐ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ స్మితా ఎస్.కుమార్, ఆలిండియా ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వీఎం.రవిశంకర్ కూడా సీఎస్ను కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు.