మారేడ్పల్లి,జూన్ 24: ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని,ఇప్పటి వరకు 96లక్షల వ్యాక్సిన్ డోసులు ఇచ్చామని ఇంకా రెండు రోజుల్లో కోటి డోసులకు చేరుకుంటామని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్కుమార్ అన్నారు. గురువారం సికింద్రాబాద్ మోండా మార్కెట్ డివిజన్లో ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…జీహెచ్ఎంసీ పరిధిలో 30మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాలతో పాటు, 100 వ్యాక్సిన్ కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుందన్నారు.డోసులు తక్కువ వస్తున్నదున్న ముందుగా వైరస్ వాహకులు ఉండే సూపర్ స్ప్రెడర్స్కు ప్రాధాన్యత ఇచ్చి వ్యాక్సిన్లు అందిస్తున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్ పై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు సీఎస్ సోమేశ్ కుమార్ సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి, డీసీ ముకుందరెడ్డి, ఎస్పీహెచ్ఓ రాజశ్రీ, డీపీఆర్వో భాను తదితరులు పాల్గొన్నారు.