శంషాబాద్, జూన్ 5: సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు రాష్ట్రంలో హై ఎక్స్ పోజర్ గ్రూప్ వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు సీస్ సోమేశ్కుమార్ తెలిపారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా శనివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన హై ఎక్స్ పోజర్ గ్రూప్ వ్యాక్సినేషన్ సెంటర్ను సీఎస్ సోమేశ్కుమార్, ఎమ్మెల్యే ౦ప్రకాశ్గౌడ్, సీడీఎంఏ సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్, జాయింట్ కలెక్టర్ ప్రతీక్జైన్, మున్సిపల్ చైర్పర్సన్ సుష్మామహేందర్రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా సోమేశ్కుమార్ మాట్లాడుతూ.. స్పెషల్ డ్రైవ్ వ్యాక్సినేషన్ కోసం ఆయా రంగాలకు సంబంధించి 12 గ్రూప్లకు చెందిన వ్యక్తులను గుర్తించి వ్యాక్సినేషన్ చేపట్టినట్లు వెల్లడించారు. హై ఎక్స్పోజర్ క్యాటగిరిలో కిరాణాషాపులలో పనిచేసే వారికి, సెలూన్లలో పనిచేసేవారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలలో నేడు ప్రారంభించినట్లు వివరించారు. ఈ వర్కర్లు తమ పేర్లను రిజిష్టర్ చేసుకోవడానికి మున్సిపల్ శాఖ ప్రత్యేక యాప్ రూపొందించినట్లు తెలిపారు. రిజిస్రేషన్ చేసుకున్న వారి మొబైల్కు మెసేజ్ అనంతరం వ్యాక్సినేషన్కు అనుమతిస్తారని చెప్పారు. నేరుగా వచ్చేవారిని ఇకనుంచి అనుమతించరని సూచించారు.
ప్రజాప్రతినిధులకు విధిగా వ్యాక్సినేషన్..
రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ముందుగా మున్సిపల్ , పంచాయతీ ప్రజా ప్రతినిధులైన చైర్మన్లు, సర్పంచ్లకు స్పెషల్ డ్రైవ్ ద్వారా విధిగా వ్యాక్సినేషన్ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సీఎస్ సోమేశ్కుమార్ తెలిపారు. కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకునేలా ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.