కాచిగూడ,సెప్టెంబర్ 12 : ఊరికి వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై వి.లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కాచిగూడలోని చెప్పల్బజార్ ప్రాంతానికి చెందిన జి.శంకర్(50)వృత్తిkwత్యా టిఫిన్ మాస్టర్. గత నెల 29వ తేదీన ఉదయం ఊరికి వెళ్లి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పిన శంకర్ ఇప్పటికి ఇంటికి రాకపోవడంతో కలత చెందిన కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు ఇళ్లలో వెతికినా ఆచూకి లభించకపోవడంతో కూతురు శనివారం రాత్రి కాచిగూడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఇంట్లోంచి శంకర్ వెళ్లే సమయంలో నీలి రంగు చొక్కా, కాకి రంగు ప్యాంట్ ధరించి, ఎత్తు 5.5 ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కూతురు ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.