కాచిగూడ,ఆగస్టు 29 : జల్సాలకు అలవాటు పడి రద్దీగా ఉన్న రైల్వేస్టేషన్లలో సెల్ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని కాచిగూడ రైల్వేపోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కాచిగూడ రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రావు వివరాలను వెల్లడించారు. మలక్పేట ప్రాంతానికి చెందిన రజాక్ కుమారుడు సయ్యద్ హుస్సేన్(31) వృత్తి రీత్యా కూలి. ఉదయం, రాత్రి సమయాల్లో రద్దీగా ఉండే రైల్వేస్టేషన్ల్లో ఫోన్ మాట్లాడుతున్న ప్రయాణీకులు, రద్దీ ప్రదేశాలలో సెల్ఫోన్లను దొంగలిస్తుంటాడని తెలిపారు.
దొంగిలించిన సెల్ఫోన్లను అమ్ముకుంటూ తాగుతూ జల్సాలు చేస్తుంటాడు. వారం రోజుల క్రితం కాచిగూడ రైల్వేస్టేషన్లో ప్లాట్ఫారం-1పై రైలు ఎక్కుతుండగా ప్రయాణికుని జేబులోంచి ఖరీదైన సెల్ఫోన్ను దొంగిలించాడు. బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కాచిగూడ రైల్వేపోలీసులు కాచిగూడ రైల్వేస్టేషన్లో తనిఖీలు చేస్తుండగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు.
అనుమానం వచ్చి హుస్సేన్ను పోలీస్స్టేషన్కు తరలించారు. ఆతను చేసిన దొంగతనాన్ని ఒప్పుకున్నాడు. సెల్ఫోన్ను స్వాదీనం చేసుకొని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.