గోల్నాక, ఆగస్టు 26 : బ్యాంకు అధికారులు, పోలీసులు, ప్రసారమాధ్యమాలు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఎంత ప్రచారం చేస్తున్నా మోసాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా క్రిడిట్ కార్డు నుంచి నగదు మాయం చేసిన ఉదంతం అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం..అంబర్పేట ప్రేమ్నగర్కు చెందిన సద్దార్ఖాన్ (32)….ఇతడు కొటక్ మహేంద్ర బ్యాంకుకు చెందిన క్రిడిట్ కార్డు వినియోగిస్తున్నాడు.
కాగా.. ఈ నెల 2వ తేదీన రూ.58వేలు, రూ.5 వేలు మొత్తం రూ.63 వేలు రెండు విడతలుగా విత్డ్రాచేసుకున్నారని ఈనెల 21న బ్యాంకు పంపిన నెలవారీ స్టేట్మెంట్లో చూసి ఒక్క సారిగా కంగు తిన్నాడు. తాను క్రిడిట్ కార్డు వినియోగించుకుండానే నగదు డ్రా అయినట్లు గుర్తించిన బాధితుడు తాను మోసపోయానని గ్రహించి గురువారం పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా..సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.