కాచిగూడ,సెప్టెంబర్ 13 : అనారోగ్యంతో ఫుట్పాత్పై గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందిన సంఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. కాచిగూడ అడ్మిన్ ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని వృద్ధుడు(65) టూరిస్ట్ హోటల్ సమీపంలో గల ఆదిశక్తి అపార్ట్మెంట్ ఫుట్పాత్పై అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మృతి చెందాడు.
సమాచారం అందుకున్న కాచిగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖాన మార్చురీకి తరలించారు. మృతుడి ఒంటిపై గొధుమ రంగు చొక్క, నీలి రంగు బెడ్షీట్ ధరించి ఎత్తు 5.9 ఉన్నట్లు తెలిపారు. మృతి చెందిన వృద్ధుడి వివరాల కోసం 7382296573లో సంప్రదించాలని కాచిగూడ పోలీసులు కోరారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.