వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసి.. క్రికెట్ బెట్టింగ్, గుర్రపు పందాలు నిర్వహిస్తున్న బుకీతోపాటు మరో ముగ్గురిని రాచకొండ ఎస్ఓటీ పోలీసులు శనివారం అరెస్ట్చేసి రిమాండ్కు తరలించారు. అతడి వద్ద నుంచి రూ.7.21 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ ఒంగోలు ప్రాంతానికి చెందిన మద్దాలి సాయి కుమార్ హైదరాబాద్కు వలస వచ్చి పాత సఫిల్గూడలోని సంతోషిమా నగర్లోని ఓ అపార్టుమెంట్లో ఫ్లాట్ను అద్దెకు తీసుకుని.. గుర్ర పు పందాలు, క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్నాడు.
దీని కోసం పందెంరాయుళ్లతో ఓ వాట్సాప్ గ్రూపును రూపొందించి.. ఆన్లైన్లో బెట్టింగ్ నగదును వసూలు చేస్తున్నాడు. ఇదంతా వాట్సాప్ గ్రూపులోనే జరుగుతున్నది. ఎవరీకి అనుమానం రాకుండా ఫ్లాట్లో కిశోర్బాబు అనే వ్యక్తిని పెట్టి ఈ దందాను నిర్వహిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ నవీన్కుమార్ బృందం ఆ ఫ్లాట్పై దాడిచేసి నిర్వాహకుడు సాయికుమార్, పందెంరాయుళ్లు పులి కిశోర్ బాబు, కొండుర్తి సందీప్, పులి కిశోర్లను అరెస్ట్ చేశారు.