కంటోన్మెంట్, ఏప్రిల్ 13 : జూదం.. ఒకప్పుడు ఈ పేరు వింటేనే గుండెల్లో హడల్.. ఇంట్లో గొడవలతో పా టు ఉన్న ఆస్తినంతా అమ్ముకుని రోడ్డున పడేవారు. కానీ నేడు అలాంటిదే ఇంకో రకమైన మహమ్మారి వచ్చేసింది.. కరోనా జీవితాలను ఓ వైపు అల్లకల్లోలం చేస్తుంటే మరోవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) బెట్టింగ్ ప్రా ణాల మీదకు తెస్తున్నది. కాయ్ రాజా కాయ్.. అంటూ బెట్టింగ్ దందా జోరుగా సాగుతున్నది. ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభం కావడంతో ‘వస్తే వెయ్యి.. పోతే వంద’ అన్న చందంగా పందెం కాస్తున్నారు. ఆ జట్టు గెలి స్తే వెయ్యి.. ఓడితే రెండింతలు.. ఈ బంతి సిక్స్పోతే ఇం త.. ఫోర్ పోతే అంత.. వికెట్ పడితే ఇంతా అంటూ బె ట్టింగులు కాస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
ఇటీవల కాలం వరకు సెల్ఫోన్లలో మాట్లాడుకుంటూ పందేలు కాసేవారు. చాలా మంది టీవీల్లో మ్యాచ్లు చూ స్తూ, లాడ్జింగ్ లు, హోటళ్లలో కూర్చొని బెట్టింగ్లు వేసేవారు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా విస్తృతితో బెట్టింగ్ రాయుళ్లు ఐపీఎల్ ప్రారంభానికి ముందే గ్రూపులుగా ఏర్పడ్డారు. వాట్సాప్ గ్రూపులను సైతం ఏర్పాటు చేశారు. పది మందికి ఒక వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేసుకుని ఎవరికీ అనుమానాలు రాకుండా యథేచ్ఛగా బెట్టింగ్ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.
నగరంలోని ఇతర ప్రాంతాలతో పాటు నార్త్జోన్ పరిధిలో పలువురు యువకులు బెట్టింగ్ రాయుళ్ల అవతారమెత్తారు. రూ. 100 మొదలుకొని రూ. 10వేల వరకు సాధారణంగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. మ్యాచ్ల పరిస్థితులను బట్టి రూ. 20వేల నుంచి రూ. 50వేల వరకు కొందరు ముంబై బెట్టింగ్ బృందాలతో పందేలు కాస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ బెట్టింగ్ రా యుళ్లపై కఠినంగా వ్యవహరిస్తే చాలా మంది యువతతో పాటు కుటుంబాల్లోనూ గొడవలు, కష్టాలు తీరుతాయి.
బెట్టింగ్ రాయుళ్లు ప్రధానంగా యువతను టార్గెట్ చేస్తున్నారు. పది మందికి ఒకరు చొప్పున బెట్టింగ్ రాయుళ్లకు అనుకూలంగా వ్యవహరిస్తారు. వీరికి బెట్టింగ్ రాయుళ్లు మ్యాచ్ ఓడినా.. గెలిచినా 5శాతం చొప్పున చెల్లిస్తుండడంతో అనుకూలంగా వ్యవహరించే వ్యక్తి యువతను బెట్టింగ్ల వైపు ప్రోత్సహిస్తున్నారు. ప్రధాన చౌరస్తాలు, ఎటువంటి సంచారం లేని వీధులను ఎంపిక చేసుకుని ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు. ఏడాది కష్టపడినా ఇంత పెద్ద మొత్తంలో డబ్బు రాదంటూ యువతను రెచ్చగొట్టి మరీ ఈ కూపంలోకి దింపుతున్నారు.
బెట్టింగ్లను పూర్తిగా అరికట్టాలంటే విద్యార్థులు, యువకులపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టిని సారించాలని పోలీసులు సూచిస్తున్నారు. మ్యాచ్లు జరుగుతున్న సమయంలో పిల్లలు టెన్షన్గా ఉండటం, సెల్, ల్యాప్ట్యాప్, కంప్యూటర్ల వినియోగం అధికంగా ఉంటే వారిని ఆరా తీయాలి. మనీ ట్రాన్స్ఫర్లపై దృష్టి పెట్టాలి.
ఎవరూ ఐపీఎల్ బెట్టింగ్కు పాల్పడకూడదు. ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. ఎవరైనా, ఎక్కడైనా క్రికెట్ పేరిట బెట్టింగ్లు నిర్వహిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్లపై మఫ్టీ, ఆన్లైన్లో ఉన్న పోలీసుల ద్వా రా నిఘా అప్రమత్తం చేస్తాం. పట్టుబడితే కేసులు నమోదు చేస్తాం. బెట్టింగ్ విషయంలో పిల్లల కదలికలపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.- పరావస్తు మధుకర్స్వామి, సీఐ, కార్ఖానా