సిటీబ్యూరో, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ): అక్రమంగా మత్తు పదార్థాలు, డ్రగ్స్ సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. గురువారం గచ్చిబౌలిలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 పై అధికారులు, సిబ్బంది అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. కమిషనరేట్ పరిధిలో నమోదైన డ్రగ్స్ కేసుల పురోగతిపై సమీక్షించారు. తరచుగా మత్తు పదార్థాలను సరఫరా చేసి అరెస్టయిన వారిపై పీడీ యాక్ట్ విధించాలన్నారు. మత్తుపదార్థాల సరఫరాను అరికడితే మత్తులో జరిగే నేరాలను పూర్తిగా అరికట్టవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.