సిటీబ్యూరో, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్, గంజాయి, నిషేధిత మత్తు పదార్థాల విక్రయాలను అణిచివేసేందుకు నార్కొటిక్ డ్రగ్స్ సెల్ను ఏర్పాటు చేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. గురువారం స్పెషల్ ఆపరేషన్ టీం, స్పెషల్ బ్రాంచి, సీసీఆర్బీ అధికారులతో గచ్చిబౌలి పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. సమావేశంలో క్రైం డీసీపీ రోహిణి ప్రియదర్శిని, ఎస్వోటీ డీసీపీ సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.