కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్
వెల్దండలో ముస్లింలకు దుస్తులు పంపిణీ
వెల్దండ, మే 8: రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శనివారం వెల్దండ మండల కేంద్రంలోని జీపీ ఆవరణంలో సర్పంచ్ భూపతిరెడ్డి అధ్యక్షతన ముస్లింలకు దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మండలంలో 200 మంది ముస్లిం కుటుంబాలకు మంజూరైన దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజల ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమన్నారు. రాష్ట్రంలో ప్రతిఏటా కోటి మందికి బతుకమ్మ చీరలు, 22లక్షల మంది ముస్లింలకు రంజాన్ కిట్లు, క్రైస్తవులకు కిస్మస్ దుస్తులు అందజేస్తున్నట్లు తెలిపారు. ముస్లిం మైనార్టీలకు సబ్ప్లాన్ ద్వారా రూ.1500 కోట్లు కేటాయించి వారి అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తున్నదన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తాసిల్దార్ వెంకట్మ్రణ, ఎంపీటీసీ గుత్తి వెంకటయ్య, సర్పంచ్ శారదమ్మ, కోఆప్షన్ సభ్యుడు అలీం, మాజీ ఎంపీపీ జయప్రకాశ్, జైపాల్నాయక్, గోపాల్నాయక్, రాజశేఖర్, పర్వతాలు, వెంకటయ్య, ప్రభాకర్, శిశుపాల్రెడ్డి, సమీర్బాబా, ఆర్ఐ శేఖర్, ముస్లిం నాయకులు యాకు బ్, సాధిక్, పాషా, ఇమాం, సుల్తాన్ తదితరులు ఉన్నారు.