హైదరాబాద్ : కరోనా మహమ్మారి ప్రభావం రైల్వేలపై భారీగా పడుతున్నది. దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్డౌన్, మరికొన్ని కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో జనం ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. దీంతో రైళ్లలో ఆక్సుపెన్సీ తగ్గుతోంది. ఫలితంగా రైల్వేశాఖ పలు సర్వీసులను రద్దు చేస్తోంది. ఇప్పటికే రాజధాని, శతాబ్ది, దురందో ఎక్స్ప్రెస్ సహా పెద్ద ఎత్తున రైళ్లు రద్దు చేసింది. తాజాగా దక్షిణ మధ్య రైల్వే 12 రైళ్లను రద్దు చేసింది. ఇందులో సరైన ఆక్సుపెన్సీ లేని కారణంగానే రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.