సిటీబ్యూరో, మే 21(నమస్తే తెలంగాణ): లాక్డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రాచకొండ పోలీసులు చర్యలు తీసుకున్నారు సగం మాస్కు ధరించిన 6,367 మందికి చలాన్లు జారీ చేశారు. కాగా, శుక్రవారం పలు ప్రాంతాలను సీపీ మహేశ్భగవత్ సందర్శించి.. వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని వారి వాహనాలను జప్తు చేశారు. ఇలా ఇప్పటి వరకు 1579 వాహనాలను సీజ్ చేశామని వివరించారు. అలాగే భౌతిక దూరం పాటించని 1228 మందిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి శుక్రవారం వరకు 25,537 కేసులు నమోదు చేశామని సీపీ వివరించారు.