సిటీబ్యూరో, జూలై 28(నమస్తే తెలంగాణ): టెక్నాలజీని వినియోగిస్తూ మహిళలను వేధిస్తున్న నేరస్తులను పట్టుకోవాలని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ షీ టీమ్స్కు సూచించారు. షీ టీమ్స్, భరోసా కేంద్రం పనితీరుపై సమీక్షించి, వస్తున్న ఫలితాలపై బుధవారం ఆరా తీశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. షీ టీమ్స్కు వచ్చే బాధితులకు భరోసా ఇస్తూ, గోప్యత కూడా పాటించాలన్నారు. మహిళలను వేధింపులకు గురిచేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేయడంతో షీ టీమ్స్ హాట్ స్పాట్లపై మరింత నిఘా పెట్టాలని, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా అదనపు సీపీ, షీ టీమ్స్ ఇన్చార్జి శిఖా గోయెల్, షీ టీమ్స్ అదనపు డీసీపీ శిరీష రాఘవేంద్ర కలిసి షీ టీమ్స్ ఈ ఏడాది జూలై 15 వరకు నమోదు చేసిన కేసులకు సంబంధించిన వివరాలను వివరించారు.