హైదరాబాద్ : సికింద్రాబాద్ వెస్లీ కాలేజ్ వద్ద ఏర్పాటు చేసిన పోలీసు తనిఖీ కేంద్రాన్ని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు పకడ్బందీగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రతీ రోజు 8 వేలకు పైగా లాక్డౌన్ ఉల్లంఘన కేసులు నమోదు అవుతున్నాయని చెప్పారు. 5 నుంచి 6 వేల వరకు వాహనాలు సీజ్ అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ -పాసులు దుర్వినియోగం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా ఆకృతి వేషధారణలో పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు.