హైదరాబాద్ : హైదరాబాద్లో బోనాలు ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ అధికారులు, పోలీసులను ఆదేశించారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. బోనాల వేడుకల్లో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, అనారోగ్యంతో ఉన్న వారెవరూ ఆలయాలకు రావొద్దని సూచించారు. నకిలీ విత్తనాలు, డ్రగ్స్ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు.
జూలై 11న గోల్కొండ కోటపైనున్న జగదాంభిక ఎల్లమ్మ ఆలయంలో జరిగే మొదటి బోనం పూజతో ఈ ఏడాది బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు దేవాదాయశాఖ అధికారులు, బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జూలై 11న గోల్కొండ బోనాలు /అమ్మవారివారి ఘటోత్సవం
జూలై 25న సికింద్రాబాద్ (లష్కర్) బోనాలు
జూలై 26న రంగం
ఆగస్టు 1న హైదరాబాద్ (పాతబస్తీ) బోనాలు