మెహిదీపట్నం, మే 20 : కరోనా కష్టకాలంలో అనాథలు, వృద్ధులకు అండగా ఉండాలని, స్వచ్ఛంద సేవా సంస్థలు వారికి సేవలు అందించాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. గురువారం హుమాయూన్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని విజయ్నగర్ కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో అగర్వాల్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో వృద్ధులు, అనాథలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణం లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనాథలు, వృద్ధులను ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని తెలిపారు. అగర్వాల్ సేవా స మాజ్ ఎన్నో కార్యక్రమాలను స్వచ్ఛందంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జాయింట్ కమిషనర్, పశ్చిమ మండలం డీసీపీ ఏ ఆర్.శ్రీనివాస్, అదనపు డీసీపీ ఇక్బాల్ సిద్ధిఖీ, ఆసిఫ్నగర్ ఏసీపీ ఆర్జీ.శివమారుతి, ఇన్స్పెక్టర్ సునీల్, అదనపు ఇన్స్పెక్టర్ నారాయణ రెడ్డి పాల్గొన్నారు.