హైదరాబాద్ : ఆకలితో అలమటిస్తున్న చిన్నారులకు తన టిఫిన్ బాక్స్ ఇచ్చి ఆకలి తీర్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎస్.మహేశ్ కుమార్ను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అభినందించారు. సోమవారం రాత్రి ఆహారం కోసం అడుక్కుంటున్న ఇద్దరు చిన్నారుల దీనస్థితిని చూసి చలించిపోయిన కానిస్టేబుల్ మహేశ్ కుమార్ తను తెచ్చుకున్న భోజనాన్ని పిల్లలకు వడ్డించి వారి ఆకలి తీర్చాడు. ఈ చర్య సర్వత్రా ప్రశంసలందుకొంది. సీసీ అంజనీకుమార్ మహేశ్ను వ్యక్తిగతంగా అభినందించారు. ఓ మెమోంటోను బహూకరించారు.