కరోనా పరీక్షలకు, చికిత్స కోసం వెళ్లేవారు.. తమ ఒంటిపై ఆభరణాలు ఇంట్లోనే ఉంచి వెళ్లడం మంచిదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సూచించారు..
ఏ సమస్యా రాకుండా ఉండడానికి ముందుగానే ఒంటిపై ఉండే బంగారు ఆభరణాలు, పర్సులు ఇంట్లోనే పెట్టిరావడం మంచిదని సూచించారు.
విలువైన వస్తువులు పోయిన తరువాత పోలీస్స్టేషన్కు వెళ్లడం, ఆ తరువాత కుటుంబ సభ్యులందరూ ఆందోళనకు గురికావడం మం చిది కాదని చెప్పారు.
ప్రస్తుతం విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాం.
ఫ్రంట్లైన్ వారియర్స్గా ఉన్న వైద్యులు, పోలీసుల విలువైన సమయాన్ని వృథా చేయడం వల్ల సమాజానికి నష్టం వాటిల్లుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సీపీ తాను చేసిన ట్వీట్లో పేర్కొన్నారు.