దోమలగూడ, ఏప్రిల్ 30 : ప్రపంచంలో భద్రత కలిగిన నగరాల్లో హైదరాబాద్ నగరం 16వ స్థానంలో ఉండటం గర్వంగా ఉందని సీపీ అంజనీ కుమార్ అన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మధ్యమండలంలో ఏర్పాటు చేసి న 250 సీసీ కెమెరాలను.. శుక్రవారం బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మం డపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఇప్పటికీ హైదరాబాద్ మహానగరంలో 3 లక్షల 70 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 51 మంది దాతల సహకారంతో రూ.78 లక్షలతో 250 సీసీ కెమెరాల ఏర్పాటు చేశామ ని, సహకరించిన దాతలకు సీపీ ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోనే గురువారం మధ్యాహ్నం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఏటీఎం చోరీ, హత్య కేసును పో లీసులు ఛేదించారని, అదే విధంగా తూర్పు మండలంలో గురువారం రాత్రి జరిగిన దోపిడీ కేసును 4 గం టల్లో ఛేదించగలిగామని సీపీ వెల్లడించారు. ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్ కుమార్, జాయింట్ సీపీ విశ్వప్రసాద్, అదనపు డీసీపీ రమణా రెడ్డి, చిక్కడపల్లి, ఆబిడ్స్ డివిజన్ల ఏసీపీలు, సీఐ, డీఐలు పాల్గొన్నారు.