అవసరమైన వారే దవాఖానలో చేరాలని, డబ్బుందని దవాఖానలో చేరి బెడ్లను స్వాధీనం చేసుకోవద్దని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ట్విట్టర్ ద్వారా ప్రజలకు ఒక సందేశాన్ని పంపించారు.
ఈ సదర్భంగా నాగపూర్కు చెందిన 85 ఏండ్ల నారాయణ దావల్కార్ కరో నాతో చికిత్స పొందుతూ.. తన బెడ్ను ఓ వ్యక్తికి ఇచ్చి.. అతను డిశ్చార్జి మృతి చెందాడనే విషయాన్ని సీపీ గుర్తు చేశారు.
ఇక్కడ బెడ్లు.. వయస్సున్న వారికి ఎంతో అవసరమనే విషయాన్ని దవాఖాన వైద్యులు గుర్తు చేశారని సీపీ తన ఆడియో సందేశంలో పేర్కొన్నారు.
అయితే.. ఇప్పు డు అత్యవసరమైన వారికి దవాఖానలో బెడ్ దొరకని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.
సాధారణ లక్షణాలున్నవారు సైతం దవాఖానలో బెడ్ తీసుకొని కూర్చుంటున్నారు.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎవరికైతే అవసరమో అలాంటివారే దవాఖానలో చేరాలని సీపీ సూచించారు.