సిటీబ్యూరో, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ): అక్షయ విద్యా స్వచ్ఛంద సంస్థ ట్యూటర్లను నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రశంసించారు. శుక్రవారం ఆ సంస్థలో పనిచేస్తున్న ట్యూటర్ల(శిక్షకులు)తో భరోసా కేంద్రంలో నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్తో పాటు అదనపు సీపీ శిఖాగోయెల్, జాయింట్ సీపీ రమేష్రెడ్డి, భరోసా ఇన్చార్జి అదనపు డీసీపీ శిరీష రాఘవేంద్ర తదితర అధికారులు మాట్లాడారు. పేద కుటుంబాల నుంచి వచ్చిన ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఈ స్వచ్ఛంద సంస్థ తరఫున నగరంలోని పలు మురికివాడల్లోని పిల్లలకు ఉచితంగా చదువులు చెబుతున్నారు. ఒక్కొక్కరూ 30 మందిని ఎంపిక చేసుకొని విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. ఇలా 1500 మందికి అక్షయ సంస్థ నిర్వాహకులు ప్రసాద్ ఆధ్వర్యంలో విద్యాబోధన చేస్తున్నారు. ట్యూటర్లు నిస్వార్థంతో పనిచేస్తున్నారని ఈ సందర్భంగా సీపీ అభినందించారు.