చాంద్రాయణగుట్ట, జూలై 23: లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల జాతర ఉత్సవాల పూజలు తెలంగాణ సాంస్కృతిక, సంప్రదాయాలకు అద్దం పట్టేలా వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శిఖర పూజ, ధ్వజారోహణ, కలశ స్థాపన పూజలకు నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటి రోజు పూజల్లో భాగంగా ఆలయ మాజీ చైర్మన్, న్యాయవాది ఎ.మాణిక్ ప్రభు గౌడ్ ఆధ్వర్యంలో అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. చైర్మన్ కె.వెంకటేష్ కుటుంబ సభ్యులు కలశ స్థాపన చేశారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్, ఫలక్నుమా ఏసీపీ మహ్మద్ మజీద్, ఛత్రినాక ఇన్స్పెక్టర్ సయ్యద్ ఖాదర్ జిలానీ, ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు బి.బల్వంత్ యాదవ్, ఉపాధ్యక్షుడు కె.ఎస్.ఆనంద్ రావు, ఆలయ ప్రధాన కార్యదర్శి బి.మారుతి యాదవ్, ప్రతినిధులు జి.అరవింద్, కుమార్ గౌడ్, జె.లక్ష్మీనారాయణ, కె.విష్ణుగౌడ్, జి.కాశీనాథ్ గౌడ్, శీరా రాజ్ కుమార్, సి.రాజ్ కుమార్ యాదవ్, కె.కృష్ణాగౌడ్, కె.సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.