సిటీబ్యూరో, జూలై 11(నమస్తే తెలంగాణ): టెక్నాలజీని ఉపయోగించి ప్రజలకు వేగవంతంగా సేవలు అందించాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సూచించారు. ఇటీవల కొత్తగా ఎస్హెచ్ఓ, డీఐలుగా నియమించిన 23మంది ఇన్స్పెక్టర్లతో ఆదివారం సీపీ సమావేశమయ్యారు. ఎస్హెచ్ఓగా ఎలాంటి బాధ్యతలు నిర్వహించాలి, టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా కలుగుతున్న ప్రయోజనాలు, శాంతి భద్రతల పరిరక్షణ, నేర నివారణకు సంబంధించిన అంశాలపై శిక్షణ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ల పనితీరు బాగుంటే మంచి ర్యాంకులు వస్తున్నాయని, పనిచేసే వారిని స్ఫూర్తిగా తీసుకొని బాగా పనిచేయాలని సూచించారు.