సిటీబ్యూరో, జులై 1(నమస్తే తెలంగాణ): పక్కాగా కేసు దర్యాప్తు జరిపి.. నిందితుడికి కోర్టు శిక్ష విధించేలా సాక్ష్యాలను ప్రవేశపెట్టిన ముషీరాబాద్ ఎస్సై( ప్రస్తుతం శాలిబండ) ఎస్.సురేందర్, కోర్టు కానిస్టేబుల్ సీహెచ్ శ్రీనివాస్లకు గురువారం సీపీ అంజనీకుమార్ జ్ఞాపికను అందించి.. అభినందనలు తెలిపారు. 2016లో ముషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నది. ఆత్మహత్యకు ఆమె ఇంటి యజమాని లైంగిక వేధింపులే కారణమని బాధితు ల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో.. అప్పుడు ఎస్సైగా విధు లు నిర్వహిస్తున్న సురేందర్ దర్యాప్తు చేపట్టారు.. ఆమె ఆత్మహత్యకు ఇంటి యజమాని పీయూష్ జైన్ కారణమని గుర్తించి.. సాక్ష్యాలతో చార్జిషీట్ దాఖలు చేశారు. వాదనలు విన్న నాంపల్లి కోర్టు నిందితుడికి పదేండ్ల జైలు శిక్ష, 35 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.