సిటీబ్యూరో, జూన్ 8(నమస్తే తెలంగాణ): సౌత్జోన్లో రిపీటెడ్ నేరగాళ్లపై పీడీయాక్టులు, నేరం చేసిన వారికి పడుతున్న శిక్షలు, పెండింగ్ తదితర అంశాలపై నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్లో సమీక్ష నిర్వహించారు. సౌత్జోన్లో ఇటీవల జరిగిన నేరాలు.. వాటి దర్యాప్తులకు సంబంధించి వివరాలను సీపీ అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తును కూడా త్వరగా పూర్తి చేయాలని, పెండింగ్లో ఉండేందుకు గల కారణాలపై తెలుసుకున్నారు. సౌత్జోన్కు సంబంధించిన కేసుల్లో వెలువడుతున్న తీర్పుల్లో శిక్షల శాతం ఏ మేర ఉంది, పోలీస్ స్టేషన్ల వారీగా ఆరా తీశారు. శిక్షల శాతం తక్కువగా ఉంటే దానికి గల కారణాలను అడిగి, తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. సమావేశంలో నగర అదనపు సీపీ శిఖా గోయెల్, డీఎస్ చౌహాన్, సౌత్జోన్ డీసీపీ గజారావు భూపాల్ తదితరులు పాల్గొన్నారు.