బన్సీలాల్పేట్, మే 31: కరోనా రోగులకు మెరుగైన వైద్య సేవలందిస్తూ దేశంలోనే ఖ్యాతి గాంచిన గాంధీ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసుల సేవలు అభినంద నీయమని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అన్నారు. సోమవారం గాంధీ వైద్యశాల ప్రధాన గేట్ వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును ఆయన పరిశీలించారు. అనంతరం నార్త్ జోన్ పోలీసులకు మేడ్చల్ జిల్లాకు చెందిన రాజీవ్ అనే సామాజిక కార్యకర్త సహకారంతో డ్రై ఫ్రూట్స్, పండ్లు, మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గాంధీ వద్ద ప్రతిరోజు 250 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. విధి నిర్వహణలో అనేక మంది పోలీసులు కరోనా బారిన పడ్డారని ఆయన తెలిపారు. కరోనా యోధులుగా వైద్యుల తర్వాత పోలీసులకు కూడా గుర్తింపు రావడం ఆనందంగా ఉందన్నారు. పోలీసులకు సహకారం అందిస్తున్న దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నార్త్ జోన్ డీసీపీ కల్మేశ్వర్ సింగన్వార్, ఏసీపీ వెంకటరమణ, ఎస్బీ ఏసీపీ నర్సయ్య, ట్రాఫిక్ ఏసీపీ వినోద్కుమార్, చిలకలగూడ ఇన్స్పెక్టర్ జి.నరేశ్, డీఐ సంజయ్కుమార్ పాల్గొన్నారు.