మెహిదీపట్నం మే 28: ప్రజల సహాయ సహకారాలతో నగరంలో లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు నగర సీపీ అంజనీకుమార్ అన్నారు. శుక్రవారం మెహిదీపట్నం రైతుబజార్ వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టును పరిశీలించి.. వాహనాలను తనిఖీ చేశారు. కరోనా వైరస్ వేషధారణలతో ఉన్న సిబ్బందితో కలిసి ప్రజలకు కొవిడ్పై అవగాహన కల్పించారు. అక్కడి రైతు బజార్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. అనంతరం చెక్పోస్టు వద్ద దాతలు అందించిన ఎన్95 మాస్కులు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను సిబ్బందికి అందించారు. సీపీ వెంట జాయింట్ కమిషనర్, పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, అదనపు డీసీపీ ఇక్బాల్ సిద్ధిఖీ, ఏసీపీ ఆర్జీ శివమారుతి, ఇన్స్పెక్టర్లు సునీల్కుమార్, శ్రీనివాస్, సుధీర్కుమార్, అదనపు ఇన్స్పెక్టర్ నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.