కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోస్ను జూలై 11 నుంచి నుంచి ప్రారంభిస్తామని.. కేంద్రప్రభుత్వం సవరించిన ఆదేశాల మేరకు 12 వారాల తర్వాతే రెండో డోస్ వేయాలని నిర్ణయించామన్నారు. వ్యాక్సిన్ రెండో డోస్ వేసుకునే వారు జూలై 11 వరకు వ్యాక్సిన్ కేంద్రాల వద్దకు రావద్దని.. కచ్చితంగా 12 వారాలు దాటిన తర్వాతే రావాలని మంత్రులు కోరారు. కరోనా నియంత్రణకై ప్రభుత్వం లాక్డౌన్ విధించిందని.. అత్యవసరమైతేనే బయటికి రావాలని కోరారు. లాక్డౌన్లో ఎవరూ పస్తులు ఉండొద్దన్న ఉద్దేశంతో 250 అన్నపూర్ణ భోజన కేంద్రాల ద్వారా ప్రతి రోజూ 60వేల మందికి ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. మంత్రుల వెంట కలెక్టర్ శ్వేతా మహంతి, జోనల్ కమిషనర్ ప్రావీణ్య, రవికిరణ్, హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి వెంకటి, డ్రగ్స్ జాయింట్ డైరెక్టర్ రాంధన్ తదితరులు పాల్గొన్నారు.