మేడ్చల్, మే 7(నమస్తే తె లంగాణ): మేడ్చల్ జిల్లా వ్యా ప్తంగా 35 కేంద్రాలలో వాక్సినేషన్(టీకాలు)ఇస్తున్నారు. ప్రతిరోజు 6,600 మందికి టీకాలు అందించే విధంగా వైద్యశాఖ చ ర్యలు చేపట్టింది. జిల్లాలోని మే డ్చల్, మల్కాజిగిరి, కూకట్పల్లి, ఉప్పల్, కు త్బుల్లాపూర్ నియోజకవర్గాలలోని 35 కేంద్రాలలో వాక్సినేషన్ (టీకాలు) అందిస్తుండటం తో ప్రజలకు సౌకర్యంగా మారింది. 31 కేంద్రాలలో 200 మంది, నాలుగు కేంద్రాల్లో 100 మందికి చొప్పున టీకాలు వేస్తున్నారు. టీకాల కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే టీకాలు వేసేందుకు అనుమతి ఇస్తున్నారు. టీ కాలు వేసుకునే వారు తప్పనిసరిగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని వైద్యశాఖకు సహకరించాలని మేడ్చల్ జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావు విజ్ఞప్తి చేస్తున్నారు.
కరోనా వచ్చిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చికిత్స అందించేందుకు వైద్యశాఖ అన్ని చర్యలు తీసుకుంటుంది. పాజిటివ్ వచ్చిన వారికి హోం ఐసొలేషన్ కిట్లను అందిస్తున్నాం. ఆరోగ్య పరిస్థితులను బట్టి అత్యవస ర చికిత్సలను అందించేందుకు సిద్ధంగా ఉ న్నాం. నియంత్రణకు సర్వే చేస్తున్నాం.- మల్లికార్జునరావు, జిల్లా వైద్యాధికారి;