మాదాపూర్, ఏప్రిల్ 21: కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకూ విజృంభిస్తుండటంతో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ బుర్రి రంగారెడ్డి పేర్కొన్నారు. బుధవారం కొండాపూర్లోని సీఆర్ ఫౌండేషన్ హోం ఫర్ ఎజ్డ్లోని వృద్ధులతో నిర్వహించిన సమీక్షా సమావేశానికి హాజరై పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని తెలిపారు. మాస్కు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలని, అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని వృద్ధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీఆర్ ఫౌండేషన్ చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ కె.రజిని, మాజీ ఎమ్మెల్యే, ప్రధాన కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి, డైరెక్టర్ చెన్నకేశవరావులతో పాటు వృద్ధులు పాల్గొన్నారు.