సిటీబ్యూరో, జూన్ 3(నమస్తే తెలంగాణ): గ్రేటర్లో వైరస్ నియంత్రణలోకి వస్తున్నది. లాక్డౌన్, వ్యాక్సినేషన్, ఇంటింటి సర్వే సత్ఫలితాలు ఇస్తున్నాయి. పాజిటివ్ కేసులు తగ్గి.. రికవరీలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పూర్తిస్థాయిలో కొవిడ్ కేంద్రంగా ఉన్న గాంధీ దవాఖానలో ఇన్పేషెంట్ల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తుండటం ఊరట కలిగించే అంశం. ఏప్రిల్ నుంచి మే 15 వరకు ప్రతిరోజూ 200 నుంచి 250 వరకు ఎమర్జెన్సీ కేసులు వచ్చేవని, ఒక దశలో పడకలు, వెంటిలెటర్లు సర్దుబాటు చేయడంలో ఇబ్బందులు తలెత్తేవని, కానీ.. వారం పది రోజుల నుంచి కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నా.. అత్యవసరమైన వాటిలో మాత్రం పెద్దగా మార్పు కనిపించలేదని గాంధీ వర్గాలు వెల్లడించాయి. నాలుగైదు రోజులుగా ఎమర్జెన్సీ కేసులు సైతం 50 శాతానికి పడిపోయినట్లు తెలిపాయి.
అత్యవసర కేసులు తగ్గి.. డిశ్చార్జిల సంఖ్య పెరుగుతున్నది. మార్చి నుంచి మే చివరినాటి వరకు 1250 నుంచి 1300 వరకు ఎమర్జెన్సీ కేసులతో పాటు సుమారు 500 వెంటిలేటర్లు, ఆక్సిజన్ పడకలన్నీ నిండుగా ఉండేవని, రెండు మూడు రోజుల నుంచి ఈ సంఖ్య వెయ్యికి తగ్గినట్లు అధికారులు తెలిపారు. అత్యవసర కేసులకు సంబంధించి బుధవారం రోజు 111 అడ్మిషన్లు జరిగినట్లు దవాఖాన కొవిడ్ నోడల్ అధికారి డాక్టర్ ప్రభాకర్రెడ్డి వెల్లడించారు.
సాధారణ పడకలు ఖాళీలు 635, ఖాళీగా ఉన్నవి 20
ఆక్సిజన్ పడకలు 600, ఖాళీగా ఉన్నవి 115
ఐసీయూ బెడ్స్ 615