కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్నది. రోజురోజుకూ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. పక్కనున్న వ్యక్తి తుమ్మినా, దగ్గినా.. చీదినా వెన్నులో వణుకుపుడుతున్నది. వైరస్ బారిన పడిన వారిని కుటుంబసభ్యులే దరిచేరనీయని దుస్థితి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ కొందరు సామాజిక బాధ్యతను విస్మరించి.. ఇష్టారాజ్యంగా బయట తిరుగుతున్నారు. వారే కాకుండా తమ కుటుంబం మొత్తాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రదేశాలు కరోనా వైరస్ వ్యాప్తికి ప్రధాన కేంద్రాలుగా నిలుస్తున్నాయి. ఆ ప్రాంతాలకు వెళ్లిన వారే ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారు. సాధ్యమైనంత వరకు ఆయా ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటమే క్షేమదాయకమని పోలీసులు, వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లితే ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని తెలుపుతున్నారు.