మాస్క్ లేకుండా రోడ్లపైకి వచ్చేవారు ఒక్క సారి ఆలోచించండి.. మన కోసమే ప్రభుత్వం చెబుతుందనే విషయాన్ని గుర్తించండి.. బయటకు వచ్చి ఇంటికి వెళ్లే వరకు పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం కావడం లేదు. మాస్క్ తో పాటు గుంపుల్లో కలువ కుండా, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం వల్ల కరోనాను కట్టడి చేసేందుకు అవకాశ ముంటుంది. బయ టకు వచ్చేవాళ్లు జాగ్రత్తగా ఇంటికి వెళ్తే.. ఇంట్లో ఉన్నవారు సురక్షితంగా ఉండేందుకు అవకాశ ముం టుంది. మాస్క్ అనేది మన కోసమేనని ప్రతి ఒక్కరూ గుర్తిం చాలి. కరోనా వైరస్ ఎవరికి చుట్టం కాదు. ఎక్కడ వీలైతే అక్కడ మనిషిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటుంది. ప్రభుత్వం జరిమానా వేస్తుందనే కాదు.. మన ఆరోగ్యం, మన కుటుంబ సభ్యుల సురక్షితం కోసం తప్పని సరిగా మా స్క్ ధరించి బయటకు రావాలని పోలీసులు సూచిస్తున్నారు.
మాస్క్ లేకుండా బయటకు వస్తే వెయ్యి రూపాయల జరిమానా తప్పదు.. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పద్ధతులను పాటిస్తేనే.. కరోనాను ఎక్కడికక్కడే కట్టడి చేసేందుకు అవకాశముంటుంది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్క్లు ధరించాలని ప్రభుత్వం ఖచ్చితమైన నిబంధన పెట్టింది. వైరస్ ధరి చేరకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మాస్క్లు ధరించడం తప్పని సరి. సెకండ్ వేవ్లో కరోనా విజృంభిస్తుండటంతో అందరూ పక్కాగా మాస్క్లు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.. నిబంధనలు ఉల్లంఘించేవారిపై మాత్రం పోలీసులు కఠినంగా వ్యవహారిస్తూ కేసులు నమోదుతోపాటు జరిమానాలు విధిస్తున్నారు. మాస్కుల ఉల్లంఘనులపై పోలీసులతోపాటు సీసీ కెమెరాలు నిఘా పెట్టనున్నాయి.. 8 రోజుల్లో మాస్కులు పెట్టుకోకుండా తిరుగుతున్న 3,214 మందిపై కేసులతోపాటు జరిమానా విధించారు.
సెకండ్ వేవ్లో కరోనా విజృంభిస్తూ.. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలంటూ నిబంధన పెట్టింది.. మాస్కులు పెట్టుకోనివారికి జరిమానాలు విధించాలని ఆదేశించింది.. దీంతో పోలీసులు మాస్కుల ఉల్లంఘనదారులపై కొరగా ఝలిపిస్తుంది… ద్విచక్రవాహనంపై వెళ్లేవారు హెల్మె ట్.. కారులో వెళ్లేవారు సీటు బెల్టు ధరించాలి. అలాగే ఇప్పు డు మాస్కులు కూడా ధరించాల్సిందే.. లేకపోతే వాహన నంబర్ ఆధారంగా జరిమానా జారీ చేస్తారు. నగరంలో ఐటీఎంఎస్(ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్) ప్రాజెక్ట్తో పాటు, అన్ని కూడళ్లలో సీపీ కెమెరాలున్నాయి. ఇవన్నీ కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానమై ఉన్నా యి. వాహనదారుడు మాస్క్ లేకుండా రోడ్డు ఎక్కాడంటే… ఆటోమెటిక్గా సీసీ కెమెరాలు ఆ వాహన నంబర్ను క్లిక్మన్పిస్తాయి. వెంటనే వాహన యజమాని సెల్ఫోన్కు మాస్క్ ధరించలేదనే జరిమానా వచ్చేస్తోంది. అలాగే ఈ సమాచారం దగ్గర్లో ఉండే పోలీసులకు వెళ్తుంది. వెంటనే సంబంధిత ఉల్లంఘనదారుడి ఫొటో తీసి, అతడి ఫోన్ నంబర్, ఆధార్ నంబర్ ఇతర వివరాలు పోలీసులు తీసుకొని.. ఈ పెటీ కేసులు నమోదు చేస్తారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో మాస్క్ ఉల్లంఘనదారులపై చర్యలు తీసుకుంటున్నారు.
మాస్క్ లేకుండా రోడ్లపైకి వచ్చేవారు ఒక్క సారి ఆలోచించండి.. మన కోసమే ప్రభుత్వం చెబుతుందనే విషయాన్ని గుర్తించండి.. బయటకు వచ్చి ఇంటికి వెళ్లే వరకు పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం కావడం లేదు. మాస్క్ తో పాటు గుంపుల్లో కలువ కుండా, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం వల్ల కరోనాను కట్టడి చేసేందుకు అవకాశ ముంటుంది. బయ టకు వచ్చేవాళ్లు జాగ్రత్తగా ఇంటికి వెళ్తే.. ఇంట్లో ఉన్నవారు సురక్షితంగా ఉండేందుకు అవకాశ ముం టుంది. మాస్క్ అనేది మన కోసమేనని ప్రతి ఒక్కరూ గుర్తిం చాలి. కరోనా వైరస్ ఎవరికి చుట్టం కాదు. ఎక్కడ వీలైతే అక్కడ మనిషిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటుంది. ప్రభుత్వం జరిమానా వేస్తుందనే కాదు.. మన ఆరోగ్యం, మన కుటుంబ సభ్యుల సురక్షితం కోసం తప్పని సరిగా మా స్క్ ధరించి బయటకు రావాలని పోలీసులు సూచిస్తున్నారు.