కందుకూరు, మే 11 : కరోనా సోకడంతో వారం రోజుల వ్యవధిలో భార్యాభర్తలు మృతిచెందిన సంఘటన నగర శివారు కందుకూరు మండల పరిధిలో చోటుచేసుకున్నది. కందుకూరు మండల పరిధిలోని దెబ్బడగూడ గ్రామానికి చెందిన అమరవాది నర్సింహ అబ్దుల్లాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేసేవాడు. అయితే నర్సింహ, వరలక్ష్మికి కరోనా సోకడంతో నర్సింహ ఈ నెల4న మృతిచెందాడు. వరలక్ష్మి సైతం సోమవారం రాత్రి మృతి చెందింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఇటీవల పెద్ద కూతురు వివాహం జరిగింది. వారం రోజుల వ్యవధిలోనే తల్లిదండ్రులను కరోనా మహమ్మారి కాటెయ్యడంతో పిల్లలు అనాథలుగా మారారు.