గ్రేటర్ పరిధిలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ రోజు రోజుకూ విజృంభిస్తోంది. దీంతో రోగులు ఆస్పత్రుల్లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే, కోవిడ్ సంక్రమించిన వారు ఆగం కావాల్సిన పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నా రు. పెరుగుతున్న రోగులకు అనుగుణంగా బెడ్స్ను వైద్యాధికారులు అందుబాటులో ఉంచుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 3,882 బెడ్స్ అందుబాటులో ఉండగా, శుక్రవా రం సాయంత్రం నాటికి 2,593 బెడ్స్ ఖాళీగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ పేర్కొంది. వైరస్ నిర్ధారణ జరిగిన వెంటనే లక్షణాలు లేని వారిని, స్వల్ప లక్షణాలున్న రోగులను ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలు లేదా హోమ్ ఐసోలేషన్కు సిఫారసు చేస్తున్నాయి. తీవ్ర లక్షణాలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ వైరస్కు గురైన రోగులను గాంధీ, ఎర్రగడ్డ టీబీ హాస్పిటల్, గచ్చిబౌలి టిమ్స్ వంటి దవాఖానాలకు తరలిస్తున్నారు.
గాం ధీ, కింగ్కోఠి, టిమ్స్, ఎర్రగడ్డ ఛాతి దవాఖాన, ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద దవాఖాన, అమీర్పేట ప్రకృతి చికిత్సాలయం, చార్మినార్ నిజామియా సరోజినీదేవి కంటి దవాఖాన, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ తదితర దవాఖానల్లో కరోనా వార్డులను ఏర్పాటు చేసి ప్రత్యేక వైద్యం అం దిస్తున్నారు. మధ్యస్థ లక్షణాలున్న రోగులను ఇతర ప్రభు త్వ కరోనా కేర్ సెంటర్లకు తరలిస్తున్నారు. ముందస్తు చర్య గా కరోనా పడకలతో పాటు ఐసీయూ పడకల సంఖ్యను పెంచుతున్నది. రాబోయే రోజుల్లోనూ రోగుల సంఖ్య పెరి గే అవకాశం ఉన్నందున అన్ని ప్రభుత్వాసుపత్రులల్లో ఉ న్న పడకలను రెట్టింపు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అన్ని ఆసుపత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పా టు రోగికి ఆక్సిజన్ అవసరమయ్యే పరిస్థితి రాకుండా ప్రత్యేక మందులు తెప్పించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది.
ప్రభుత్వ ఆసుపత్రులలో బెడ్స్ నిండటానికి ప్రధాన కారణం ‘హైపోక్సియా’ రోగులతోనే.. శరీరంలో ఆక్సిజన్ శాతం పడిపోవడాన్ని ‘హైపోక్సియా’ అంటారు. పల్స్, ఆక్సీజన్ మీటర్లో 90శాతం కంటే తక్కువ రీడింగ్ నమోదైనప్పుడు తప్పనిసరిగా ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొం దాల్సిన అవసరం ఉంది. కొందరిలో ఆక్సిజన్ శాతం తగ్గి నా ఎలాంటి నీరసం కనిపించదు. ఇలాంటి పరిస్థితిని ‘హ్యాపీ హైపోక్సియా కేటగిరి’ అంటారని గాంధీ సూపరింటెండెంట్ ప్రొ॥ డాక్టర్ రాజారావు తెలిపారు. అయితే, ఈ కేటగిరికి చెందిన వారు ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చిన అత్యాధునిక పల్స్ ఆక్సీమీటర్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.