గ్రేటర్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మహమ్మారిని నియంత్రించేందుకు బల్దియా చర్యలను వేగి రం చేసింది. నగరవాసులకు కరోనా సంబంధిత అంశాలపై సమాచారం అందించేందుకు జీహెచ్ఎంసీలో కొవిడ్-19 కంట్రోల్ రూంను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ ఆదేశించారు. 24/7 ఈ కంట్రోల్ రూం పనిచేసే విధంగా, సీనియర్ అధికారులను పర్యవేక్షకులుగా నియమించాలని అర్వింద్ కుమార్ ఆదేశించారు.