న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న భారత వాయుసేన (ఐఏఎఫ్) అత్యాధునికమైన తేలికపాటి బుల్లెట్ప్రూఫ్ వాహనాలను సమకూర్చుకున్నది. అమెరికన్ సంస్థ లాక్హీడ్ మార్టిన్ సహకారంతో తయారు చేసిన ఈ వాహనాల తొలి లాట్ను హిందూజా గ్రూపునకు చెందిన ప్రతిష్ఠాత్మక సంస్థ అశోక్ లేల్యాండ్ ఈ నెల 13న ఐఏఎఫ్కు డెలివరీ చేసింది. లాక్హీడ్ మార్టిన్ నుంచి సాంకేతికత బదిలీ (టీవోటీ) ప్రక్రియలో భాగంగా ఈ వాహనాలను పూర్తిస్థాయిలో దేశీయంగా అభివృద్ధి చేసినట్లు శుక్రవారం రెగ్యులేటరీ ఫైలింగ్లో అశోక్ లేల్యాండ్ వెల్లడించింది. బురద, ఇసుక, చిత్తడి నేలలతోపాటు రాళ్లతో నిండిన గుట్టల్లో ఇవి తేలిగ్గా ప్రయాణించగలుగుతాయని కంపెనీ వివరించింది.
ఇవీ కూడా చదవండీ…
స్విగ్గీలోకి 3,300 కోట్ల నిధులు