హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్లో కరోనా టీకా పంపిణి స్పెషల్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతున్నది. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి వ్యాక్సిన్ అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో రోజుకి 45 వేల మందికి వ్యాక్సిన్ను పంపిణీ చేస్తున్నారు. దీనికోసం మున్సిపల్ అధికారులు నగర వ్యాప్తంగా 60 వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 6 లక్షల 50 వేలకుపైగా మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. రేపటి నుంచి 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ టీకా వేయనున్నారు. అక్టోబర్ చివరి నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.