న్యూఢిల్లీ: ఆకాశాన్నంటే రీతిలో పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు విద్యుత్ వాహనాల మార్కెట్కు బాటలు వేస్తున్నాయి. ఇప్పటికే దాదాపు దేశంలోని ప్రధాన ఆటోమొబైల్ సంస్థలు విద్యుత్ వాహనాల (ఈవీ) సెగ్మెంట్లోకి ఎంటరయ్యాయి. ఆయా సంస్థలు కస్టమర్లను ఆకర్షించేందుకు ఆకర్షణీయ ఆఫర్లు ఇస్తున్నాయి. విద్యుత్ వాహనాలను కొనుగోలు చేయడానికి కేంద్రం కూడా రాయితీలు అందిస్తున్నది.
విద్యుత్ వాహనాల కొనుగోలు గతేడాది నుంచే ఊపందుకుంటున్నది. అయితే ఈవీ ఎందుకు కొనుగోలు చేయాలన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీని మైలేజీ, ధర గురించి సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎప్పుడైనా బ్యాటరీ డౌన్ అయి వాహనం షట్డౌన్ అయ్యే ప్రమాదం తలెత్తితే ఏం చేయాలన్న ఆందోళనలు ఉన్నాయి. విద్యుత్ వాహనాలకు సంబంధించి చార్జింగ్ ముఖ్యమైంది.
ప్రతి రోజూ 50-60 కి.మీ. ప్రయాణించే వారికి బ్యాటరీలు ఆగిపోతాయన్న టెన్షన్ అక్కర్లేదు. ఇప్పటికే టూవీలర్స్ సంస్థలు ఒకసారి చార్జింగ్ చేస్తే 80-100 కి.మీ. వెళ్లేందుకు వీలుగా బైక్స్, స్కూటర్లు తయారు చేస్తున్నారు. కార్లలోనయితే 300-500 కి.మీ దూరం వరకు వెళ్లొచ్చు.
ప్రస్తుతం రోజూ ఆఫీసుకు వెళ్లేవారు లీటర్ పెట్రోల్పై రూ.100 ఖర్చు చేయాల్సి వస్తున్నది. దీనికి బదులు విద్యుత్ వాహనానికి చార్జింగ్ చేస్తే రోజుకు రూ.20 మాత్రమే ఖర్చవుతుంది.
పెట్రోల్ వెహికల్స్ అయితే నెలకు రూ.3000.. దీని ప్రకారం ఏడాదికి రూ.36 వేలు ఖర్చు. దాంతో పోలిస్తే విద్యుత్ వాహనానికి కేవలం రూ.600 ఖర్చు చేస్తే సరి. దీని ప్రకారం ఈవీలపై రూ.2400 వరకు పొదుపు చేయొచ్చు. ఏడాదికి రమారమీ రూ.28,800 ఆదా అవుతుంది.
కాకపోతే పెట్రోల్ టూ వీలర్ తో పోలిస్తే ఈవీ ధర రూ. లక్ష పలుకుతుంది. అయితే, ఈవీ వల్ల నెలకు రూ.2,400 ఆదా అవుతున్నందున 38 నెలల్లో దాని ధర మనచేతికి వచ్చేసినట్లే.
అలాగే ఈవీ కారు కొనుగోలు చేసినా డబ్బు ఆదా అవుతుంది. పెట్రోల్ లేదా డీజిల్ కారు కొంటే మనం ఆదా చేసిన సొమ్ము ఖర్చై పోవడం ఖాయంగా కనిపిస్తున్నది.
ఎలక్ట్రిక్ టూ వీలర్స్ లేదా కార్లలో వాడే బ్యాటరీపై 50 వేలు లేదా లక్ష కిలోమీటర్ల వరకు వ్యారంటీ ఉంటుంది. ప్రతి ఏటా మెయింటెనెన్స్ ఖర్చు ఉండదు. ఫస్ట్ మెయింటెనెన్స్ టైం వచ్చే సరికి మీ కారు ఫ్రీ అవుతుంది.
ఎలక్ట్రిక్ వెహికల్స్లో బ్యాటరీ, మోటార్ ముఖ్యమైన విడి బాగాలు. పలు కంపెనీలు ఐపీ6 రెంటల్ బ్యాటరీలను ఆఫర్ చేస్తున్నాయి. బ్యాటరీలు వాటర్ ప్రూఫ్గా ఉండటంతో వర్షం కురుస్తున్నప్పుడు హాయిగా వెళ్లిపోవచ్చు.
ఇప్పటికే డజన్కి పైగా కంపెనీలు దేశీయ మార్కెట్లోకి వచ్చేశాయి. బెంగళూర్ బెస్ట్ అథర్ ఎనర్జీ ప్రజాదరణ పొందిన టూవీలర్గా నిలిచింది. హీరో, ఒకినావా, తాజాగా బజాజ్ ఆటో.. టూ వీలర్స్ తయారీలోకి వచ్చేశాయి. హ్యుండాయ్, టాటా, ఎంజీ మోటార్స్ ఇప్పటికే విద్యుత్ కార్లు వచ్చేశాయి.
దేశీయంగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ధరలు రూ.50 వేలు-1.50 లక్షల వరకు పలుకుతున్నాయి. విభిన్న శ్రేణుల్లో ధరలు ఉన్నాయి. టూ వీలర్స్ నుంచి ఫోర్ వీలర్స్ వరకు ఇదే పరిస్థితి ఉంది. టూ వీలర్స్ లేదా ఫోర్ వీలర్స్లో ఏది కొనాలో తేల్చుకోవాలి.
గమ్మత్తేమిటంటే కేంద్ర ప్రభుత్వం విద్యుత్ వాహనాల కొనుగోలును ప్రోత్సహిస్తున్నది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఊసే ఎత్తడం లేదు.
ఇప్పటికైతే ఢిల్లీతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్, ఉత్తరాఖండ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ ప్రభుత్వాలు విద్యుత్ వాహనాల కొనుగోలుపై 100 శాతం రోడ్ టాక్స్ డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో తయారైన విద్యుత్ వాహనాలకే సబ్సిడీ ఇస్తున్నది. కేంద్రం 62 వేల కార్లు బస్సులకు సబ్సిడీలు అందిస్తున్నది.
ఇక వేగంగా వ్యాక్సిన్లు.. సీరమ్, భారత్ బయోటెక్లకు 4500 కోట్లు
ఇక పేటీఎం నుంచి ఎల్ఐసీ పాలసీ ప్రీమియం
ఆదాయ, వ్యయాలపై డేగ కన్ను
కరోనా నివారణకు 8 మార్గాలు
ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ మరో రికార్డు.. అదేంటంటే!
డోంట్ కేర్ కరోనా.. బంగారం దిగుమతి పైపైకి
బంగారం కొనేముందు కన్ఫూజన్ వద్దు!
డ్రాగన్ బ్యాంకులు.. భారత్ ఆంక్షలు.. సిటీ నిష్క్రమణ ఎందుకంటే!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..