గాంధీ దవాఖాన వద్ద నగర పోలీసులు 24 గంటలు అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారని, కరోనా మృతదేహాల తరలింపునకు పోలీసు ఎన్ఓసీ అవసరం లేదని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఫ్రంట్లైన్ వారియర్లుగా విధులు నిర్వహిస్తున్న వైద్యులు, నర్సులు, టెక్నీషియ న్లు, ఇతర మెడికల్ సిబ్బందితో పాటు, అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులకు నగర పోలీస్ కమిషనరేట్ తరపున సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. ఆదివారం గాంధీ దవాఖాన వద్ద బందోబస్తు అంశానికి సం బంధించిన విషయాలను ఆయన వీడియో ద్వారా వివరించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇన్చార్జిగా ఉన్న గోపాలపురం ఏసీపీతో మాట్లాడి.. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, విధి నిర్వహణలో ఇతర విభాగాలతో సేఫ్టీ, సెక్యూరిటీ అంశంలో పూర్తి సమన్వయం సహకారం ఎలా ఉందని తెలుసుకున్నారు. ఏసీపీలు శ్రీనివాస్, హరికృష్ణ, సుమారు 30 మంది సబ్ ఇన్స్పెక్టర్లు ప్రతి షిఫ్ట్లో పనిచేస్తున్నారని వివరించారు. దవాఖానకు వచ్చే రోగులు, అంబులెన్స్లతో ఆ ప్రాంతమంతా రద్దీ గా ఉందని, అందుకే రోగులకు సంబంధించిన బంధువులు, అటెండర్లను గేట్ వద్దనే నిలిపివేస్తున్నామని అన్నారు.
కొత్త భవనంలోని ఏడు అంతస్తుల్లో ప్రతి అంతస్తుకు ఒక ఎస్సై ఇన్చార్జిగా ఉంటున్నారని, అలాగే కొవిడ్, నాన్కొవిడ్ జనరల్ మార్చురీల వద్ద టెంట్లు వేసుకొని ఎస్సై, కానిస్టేబుల్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారని సీపీ వివరించారు. డిటెక్టివ్ విభాగం ఏసీపీ శ్రీనివాస్రావు, మహంకాళి డీఐ పురుషోత్తంలు మెయిన్ గేట్ వద్ద విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రధాన భవనం, ఎమర్జెన్సీ బిల్డింగ్, అంబులెన్స్ మూ మెంట్ను ఇన్స్పెక్టర్లు పరిశీలిస్తున్నారని అన్నారు. ప్రతి రోజు ఉదయం మార్చురీ వద్ద మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు అన్ని జిల్లాలకు చెందిన వా రితో సమన్వయం చేసుకుంటూ అదనపు డీసీపీ శ్రీనివాస్ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.