కవాడిగూడ, ఏప్రిల్ 17: మహమ్మారి పంజా విసురుతున్న వేళ ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్పూర్ డివిజన్లోని పద్మశాలి కాలనీ వెల్ఫేర్ సొసైటీ ‘మా ఇంటికి రాకండి..మీ ఇంటికి రానివ్వకండి’ బ్యానర్లు కట్టి కరోనా కట్టడికి వినూత్న చర్యలు చేపట్టింది. సొసైటీ ప్రధాన కార్యదర్శి, బీహెచ్ఈఎల్ రిటైర్డ్ జీఎం ఆంజనేయులు ఆధ్వర్యంలో ఇంటింటికి బ్యానర్ కట్టి అవగాహన కల్పించారు. కరోనా సెకండ్ వేవ్ను కలిసికట్టుగా ఎదుర్కోవాలని కాలనీ వాసులంతా ఏకగ్రీవ తీర్మానం చేశారని ఆయన చెప్పారు. మూడునాలుగు నెలలపాటు బంధువులు సహా ఎవరినీ ఇంట్లోకి రానివ్వమని కాలనీవాసులు ప్రతినబూనారు.